నూతన నేవీ చీఫ్ గా వైస్ అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్

SMTV Desk 2019-03-23 17:54:37  indian navy chief sunil lamba, new navy Vice Admiral Karambir Singh, indian navy

న్యూఢిల్లీ, మార్చ్ 23: నేవీ చీఫ్ సునిల్ లంబా పదవికాలం ఈ ఏడాది మే నెల‌లో ముగుస్తున్న తరుణంలో నూతన నేవీ చీఫ్ గా వైస్ అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్ నియ‌మితుల‌య్యారు. ఈ విష‌యాన్ని ర‌క్ష‌ణ శాఖ ప్ర‌తినిధి ట్విట్ట‌ర్‌ ద్వారా వెల్ల‌డించారు. ఈయన వెల్లింగ్ట‌న్ డిఫెన్స్ స్టాఫ్ కళాశాలలో గ్రాడ్యుయేష‌న్ చేశారు. క‌రంబీర్‌ 1980 జూలైలో ఇండియ‌న్ నేవీలో చేరారు. క‌రంబీర్‌ తన 36 ఏళ్ల స‌ర్వీసులో ఇండియ‌న్ కోస్టు గార్డు షిప్‌, గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయ‌ర్స్‌, నావెల్ మిస్సైల్ కోర్వ‌ర్టికు క‌మాండింగ్ ఆఫీస‌ర్‌గా చేశారు. అడ్మిర‌ల్ సింగ్‌ ప్ర‌స్తుతం వైజాగ్‌లోని ఈస్ట్ర‌న్ నావెల్ క‌మాండ్‌కు ఫ్లాగ్ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, సింగ్ నేవీ చీఫ్ గా ఎన్నికైన తొలి హెలికాప్ట‌ర్ పైల‌ట్‌ గా నిలిచారు.