తొలి జాబితా విడుదల చేసిన శివసేన

SMTV Desk 2019-03-23 11:47:03  lok sabha elections, shivasena party, loksabha candidates

మార్చ్ 22: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా శివసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. మ‌హారాష్ట్ర‌లో పోటీప‌డే 21 మంది అభ్య‌ర్థుల పేర్ల‌తో జాబితాను ప్రకటించింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న శివ‌సేన‌.. మ‌హారాష్ట్ర‌లో మొత్తం 23 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక బీజేపీ మ‌రో 25 స్థానాల్లో పోటీ చేస్తుంది. పాల్గ‌ర్‌, స‌తారా లోక్‌స‌భ స్థానాల‌కు శివ‌సేన ఇంకా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. కేంద్ర మంత్రి అనంత్ గీత్‌.. రాయ్‌గ‌డ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు.