మార్చ్ 19: డీఎంకే పార్టీ లోక్ సభ ఎన్నికల సందర్భంగా తాజాగా ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత స్టాలిన్ పార్టీ కార్యాలయంలో మేనిఫేస్టో కాపీలను విడుదల చేశారు. డీఎంకే అధికారంలోకి వస్తే.. వైద్య సీటు కోసం నిర్వహించే నీట్ పరీక్ష రద్దు చేస్తాం, రాష్ట్రంలోని అన్ని విద్యా రుణాలను మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకువస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఎల్పీజీ సబ్సిడీని నేరుగా నగదు బదిలీ చేయడం, సిలిండర్ల ధరలను తగ్గించడం వంటి అంశాలను కూడా డీఎంకే మేనిఫెస్టోలో ఉంచింది.