మహిళా పోలీసు అధికారి దారుణ హత్య

SMTV Desk 2019-03-17 11:15:30  Women, Women Police,

పుల్వామా ఉగ్రవాద దాడితో ముష్కర మూట రెచ్చిపోతోంది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ పేట్రేగారు. సోసియాన్ జిల్లాలో ఓ మహిళా పోలీసు అధికారిని కాల్చిచంపారు. సోపియాన్‌లో ఖష్బూ అనే ఎస్పీఓను దుండగులు ఆమె ఇంటి వద్దే తుపాకీతో కాల్చేశారు. రక్తపుమడుగులో పడి ఉన్నా ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. కశ్మీరీల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఉగ్రవాదులు కొన్నాళ్లుగా సామాన్య పౌరులను, ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల సైన్యంలో చేడాడన్న అక్కసుతో హుసేన్ అనే యువకుణ్ని కాల్చిచంపారు.