భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్, ప్రస్తుత ఐసీసీ ఛైర్మెన్ అనిల్ కుంబ్లే న్యూస్18కి ఎక్స్క్లూజివ్ ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా వచ్చే వన్డే వరల్డ్కప్ 2019లో భారత జట్టులో ఉండే 15 మంది సభ్యుల గురించి మాట్లాడారు జంబో. తన దృష్టిలో పక్కా టీమ్లో ఉండే 11 మంది క్రికెటర్లు పేర్లు చెప్పి, షాక్కు గురి చేశాడు అనిల్ కుంబ్లే. క్రికెట్ విశ్లేషకులందరూ వన్డే ప్రపంచకప్ టోర్నీలో పక్కగా ఉంటారు అని భావిస్తున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకీ, రిషబ్ పంత్కీ వరల్డ్కప్ టీమ్లో స్థానం దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు కుంబ్లే.
అనిల్ కుంబ్లే దృష్టిలో వచ్చే వరల్డ్కప్ ఆడబోయే జట్టు ఇదే.
కెప్టెన్ విరాట్ కోహ్లీ,వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ,శిఖర్ ధావన్,మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్,ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్,కుల్దీప్ యాదవ్,పేసర్ జస్ప్రిత్ బుమ్రా,మహ్మద్ షమీ