వచ్చే ఎన్నికల్లో మోదీకి పోటీగా రైతులు

SMTV Desk 2019-03-14 10:39:54  Modi,

వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీకి ధీటుగా 111 మంది రైతులు బరిలోకి దిగుతున్నారు. రైతుల కోసం కేంద్రం మంచి పథకాలు ప్రకటించింది కదా అయినా ఎందుకు పోటీ అని అనుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. పంట రుణాల రద్దు, పంటలకు మద్దతు ధర, వ్యక్తిగత బీమా, రైతులకు పింఛన్లు వంటివి రైతులకు అందిస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకణ్ను డిమాండ్‌ చేశారు.

తిరుచ్చిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం చేపట్టే పథకాల గురించి మేనిఫెస్టోలో చేర్చకపోతే తమిళనాడు రైతులు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో 111 మంది చొప్పున ప్రత్యర్థులుగా నిలబడతారని అన్నారు. రైతుల డిమాండ్ల పరిష్కారంకోసం 140 రోజులు దిల్లీలో ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.