త్వరలో అమలుకానున్న కేంద్ర ప్రభుత్వపు ఫేమ్ 2 పథకం

SMTV Desk 2019-03-12 07:41:52  Electric vehicles, Pradhan Mantri Electric Vehicle Subsidy Scheme, FAME India 2,

న్యూఢిల్లీ, మార్చ్ 11: త్వరలో కేంద్ర ప్రభుత్వం వాహన కొనుగోలు దారులకు ఓ శుభవార్త అందివ్వనుంది. కేంద్ర ప్రభుత్వపు ఫేమ్ 2 పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీ పొందొచ్చు. దీని ద్వారా టూవీలర్‌పై రూ.20,000 వరకు, కారుపై రూ.లక్షన్నర వరకు ఆదా చేసుకోవచ్చు. ఫేమ్ 2 పథకం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీని కోసం రూ.10,000 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 10 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి రూ.20,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది. 35,000 కార్లకు ఒక్కోదానికి రూ.1.5 లక్షల సబ్సిడీ పొందొచ్చు. హైబ్రిడ్‌ కార్లకు ఒక్కో వాహనానికి రూ.13,000–20,000 వరకు రాయితీని ప్రతిపాదించారు. అలాగే 5 లక్షల ఈ-రిక్షాలకు ఒక్కో వాహనంపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది. 7,090 ఈ-బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సిడీ లభించనుంది. 2019–20 సంవత్సరం లో రూ.1,500 కోట్లు, 2020–21లో రూ.5,000 కోట్లు, 2021–22లో రూ.3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు. బస్సులకు ధర లో గరిష్టంగా 40%, ఇతర వాహనాలకు 20%గా ప్రోత్సాహకాన్ని పరిమితం చేశారు.