బెంగళూరు, మార్చి 11: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, కేజీఎఫ్ హీరో యష్ కు ప్రాణహాని ఉందని, ఆయన హత్యకు కుట్ర జరుగుతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై యష్ స్పందిస్తూ...... తనను ఎవరూ చంపాలనుకోవడం లేదని, ఈ విషయమై బెంగళూరు ఏసీపీతో ఇప్పటికే మాట్లాడానని పేర్కొన్నారు. తనపై ఎటువంటి కుట్రలు జరగడం లేదన్నారు. మీడియాలో వస్తున్న వార్తలతో తన కుటుంబ సభ్యులు, అభిమానులు కలత చెందుతున్నారని యష్ ఆవేదన వ్యక్తం చేశారు. వార్తల కారణంగా తనకు ఆగకుండా ఫోన్లు వస్తున్నాయని పేర్కొన్నాడు. ఎవరైనా ఓ గ్యాంగ్స్టర్ అరెస్ట్ అయితే తన ప్రాణాలకు ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఇంకా వీటి వల్ల ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయోనని భయంగా ఉందన్నారు. అసలు తనకు ప్రాణహాని ఉందన్న వార్తలను మీడియాకు ఎవరు చేరవేస్తున్నారో తనకు తెలియడం లేదన్నారు. ఎవడు పడితే వాడొచ్చి నరికేయడానికి తాను గొర్రెను కానని యశ్ తేల్చి చెప్పాడు.