మార్చ్ 10: దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ తాజాగా ఓ ఆఫర్ ప్రకటించింది. ఈ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 8.4 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. భారత్లో నివసించేవారు ఎవరైనా వీటిల్లో డిపాజిట్ చేయవచ్చు. అలాగే భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్ కంపెనీలు, ట్రస్ట్ అకౌంట్లకు కూడా ఇదే వడ్డీ వర్తిస్తుంది. యాక్సిస్ బ్యాంక్లో ఒక వ్యక్తి రూ.5,000 దగ్గరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ను ప్రారంభించొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్ ద్వారా అయితే రూ.5,000తోనే ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించొచ్చు. అదే బ్యాంక్ బ్రాంచ్కు వెలితే రూ.10,000లతో ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించాల్సి ఉంటుంది. రూ.5 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 8.4 శాతం శ్రేణిలో ఉంటుంది. డిపాజిట్ కాలవ్యవధిని బట్టి వడ్డీ మారుతూ ఉంటుంది.