మార్చ్ 10: ఇండోనేసియాలో మోడిఫైడ్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్ ఈ మధ్యే దర్శనమిచ్చింది. ఈ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో ఈ బైక్ ఎక్స్షోరూమ్ ధర రూ.97,340 నుంచి ప్రారంభమౌతోంది. ఇండియన్ మార్కెట్లో కన్నా దక్షిణాసియా మార్కెట్లలో ఈ బైక్కు మంచి గుర్తింపు ఉంది. టీవీఎస్ కంపెనీ ఈ బైక్లో ఫ్యూయెల్ ఇంజెక్ట్డ్ వెర్షన్ను ఇండోనేసియాకు ఎగుమతి చేస్తోంది. ప్రీమియం ఎక్విప్మెంట్, పర్టిక్యులర్ హైలెట్స్ వంటివి ఇందులో కనిపించాయి. ఫ్యూయెల్ ఫిల్లర్, ట్యాంక్ స్కూప్స్, బ్రేక్ క్యాలిపర్స్, ఫుట్ పెగ్స్, సైడ్ ప్యానెల్పై రెడ్ కలర్ కనిపిస్తుంది. బైక్ ముందు భాగంలో యూఎస్డీ ఫోర్క్స్ బంగారం రంగులో ఉంటాయి. స్మాలర్ ఫ్రంట్ డిస్క్ను పెద్ద పెడల్ డిస్క్ బ్రేక్స్తో రిప్లేస్ చేశారు. వెనుక భాగంలో మరింత పెద్ద వీల్స్ను అమర్చారు. దీంతో ఈ బైక్ చూడటానికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కాగా అపాచీ ఆర్టీఆర్ 200 బైక్లో 197.75 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 5 గేర్లు ఉంటాయి. బైక్ టాప్ స్పీడ్ గంటకు 127 కిలోమీటర్లు. ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు.