పొరపాటున సరిహద్దు దాటినా పాక్ వ్యక్తి, సురక్షితంగా ఆ దేశ సైనికులకు అప్పగించిన భారత జవాన్లు

SMTV Desk 2019-03-10 12:50:12  Indian Army, Pakistan Citizen, Pak Soldiers, Crossed Boarder

శ్రీనగర్, మార్చి 10: భారత సైనికులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. పాకిస్తాన్ భూభాగం నుండి పొరపాటున సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన ఓ పాక్ పౌరుడిని, భారత జవాన్లు పాక్ సైనికులకు సురక్షితంగా అప్పగించారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద శాంతి, సుస్థిరతను కొనసాగించడానికి ఇది ఉపయోగపడుతుందని ఈ మేరకు జవాన్లు తెలిపారు.

పాకిస్తాన్ కు చెందినా ఓ 60 ఏళ్ల వ్యక్తి శుక్రవారం జమ్ముకశ్మీర్ లోని సాంబా జిల్లాలో సరిహద్దులు దాటాడు. అతన్ని గుర్తించిన భద్రతాబలగాలు, వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా పొరపాటున సరిహద్దు దాటానని చెప్పాడు. దీంతో, నిన్న పాకిస్థాన్ సైనికులకు అతన్ని బీఎస్ఎఫ్ అప్పగించింది.