ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

SMTV Desk 2019-03-10 09:41:58  Jharkhand,

ఝార్ఖండ్‌ : ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఎన్‌హెచ్‌-33పై ఎదురెదురుగా వస్తున్న ఓ లారీ, కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారు ఔరంగాబాద్‌ నుంచి రాంచీకి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన తక్షణమే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.