మహర్షిలో మహేష్ వారసుడు..!

SMTV Desk 2019-03-10 09:38:00  mahesh, Gautham

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మొన్నటిదాకా ఏప్రిల్ 25న రిలీజ్ అని చెప్పిన చిత్రయూనిట్ ఫైనల్ గా మే 9న మహర్షి రావడం పక్కా అని అంటున్నారు.

ఇదిలాఉంటే మహర్షి సెట్స్ లో మహేష్ తనయుడు గౌతం కృష్ణ కనబడటం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. సినిమాలో ఓ స్పెషల్ రోల్ లో గౌతం కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. మహేష్ 1 నేనొక్కడు సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలో కనిపించాడు గౌతం కృష్ణ. అయితే ఒక ఫ్రేమ్ లో ఇద్దరిని చూపించి మ్యాజిక్ చేశాడు ఆ సినిమా దర్శకుడు సుకుమార్. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మరి మహర్షి లో గౌతం ఎలా కనిపించనున్నాడు అన్నది త్వరలో తెలుస్తుంది.