పేలుడు పదార్థాలు పట్టివేత, ఉగ్రవాదుల పనేనా ?

SMTV Desk 2019-03-09 13:45:59  Terrorist, Explosive items, Kolkata

Kolkatta , మార్చ్ 09 కోల్ కతా : 1000 కిలోల పేలుడు ప‌దార్ధాల‌ను ఈ రోజు కోల్‌క‌తా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి నార్త్ ప‌ర్గ‌నాస్ వైపు వెళ్తున్న టాటా మెటాడోర్ వాహ‌నాన్ని పశ్చిమబెంగాల్ లోని త‌లా బ్రిడ్జ్ వ‌ద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వాహనంలో 1000 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నట్టు గుర్తించి , వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 27 బ్యాగుల్లో ఉన్న పొటాషియం నైట్రేట్‌ పేలుడు ప‌దార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాటా మెటాడోర్ డ్రైవర్ తో పాటు క్లీనర్ ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు పదార్థాలను ఉగ్రవాదులకు చేరవేసేందుకు తీసుకెళుతున్నారా … అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు