హైదరాబాద్, మార్చ్ 07: రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా ఉద్యోగులందరికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయంలో మహిళా ఉద్యోగులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.