ముంబై, ఆగష్ట్ 6: ఒకప్పుడు ఆపిల్ ఫోన్ ఉపయోగించడం అంటే ఓ బ్రాండ్ సింబల్. కానీ ప్రస్తుతం ఆన్లైన్ మాల్స్ వచ్చిన తర్వాత పోటి ప్రపంచంలో ఆఫర్స్తో ఈ ఫోన్ సాధారణ మానవులకు కూడా అప్పుడప్పుడు అందుబాటు ధరలో దొరుకుతుంది. తాజాగా పేటీఎం ఆన్లైన్ మాల్ ఆపిల్ ప్రియులకు ఒక శుభవార్త ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ ఎస్ఈపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ రాయితీతో రూ.27,200 విలువైన ఐఫోన్ ఎస్ఈని కేవలం రూ.19,990కే దక్కించుకునే అద్భుత అవకాశం భారతీయ వినియోగదారులకు లభించింది. ఈ ఫోన్ అసలు ధరపై 15 శాతం ఆఫర్తో రూ. 22,990కే విక్రయిస్తున్న పేటీఎం తాజాగా ఈ ధరకు మరో రూ.3 వేల క్యాష్ బ్యాక్ వెల్లడించింది. అంటే మొత్తం ధరపై 7 వేలు తగ్గి రూ.19,990కే ఈ ఫోన్ అందుబాటులో ఉందన్నమాట. అంతేకాదు, రూ.9 వేల బై బ్యాక్ గ్యారంటీని కూడా ప్రకటించింది. ఈ ఫోన్లో 4 అంగుళాల రెటీనా డిస్ ప్లే, 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లు ఉన్నాయి. క్యాష్ ఆన్ డెలివరీకి క్యాష్ బ్యాక్ ఆఫర్ చెల్లదని పేటీఎం స్పష్టం చేసింది.