చెన్నై, మార్చి 6: తమిళనాడు రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు డీఎంకే పార్టీ పొత్తు కొలిక్కి వచ్చింది. ఈ కూటమిలో ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (ఐయూఎంఎల్), కొంగునాడు దేశీయ మక్కల్ కట్చి(కేడీఎంకే), ఇండియ జననాయగ కట్చి(ఐజేకే) లు ఉన్నాయి. పుదుచ్చేరి, తమిళనాడులో 40 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీఎంకే మిత్ర పార్టీలకు 20 సీట్లను కేటాయించింది. మరో 20 స్థానాల్లో తమ అభ్యర్థులే పోటి చేస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. అన్నాడీఎంకే పార్టీ బీజేపీ తో ఓ మెగా కూటమి ఏర్పాటు చివరి దశలో ఉండగా డీఎంకే కాంగ్రెస్ నేతృత్వంలో మరో కూటమి మంగళవారం రారైంది. మిత్రులకు 20 కేటాయించామని, తమ అభ్యర్థులు 20 స్థానాల్లో పోటీ చేస్తారని వివరించారు. డీఎంకే గుర్తుపై కేడీఎంకే, ఐజేకే అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ అభ్యర్థులు కూడా ఇదే గుర్తుపై పోటీ చేసే అవకాశాలున్నాయన్నారు.