ఒకరూ ఇద్దరూ కాదు...ముగ్గురైతే ముచ్చట!

SMTV Desk 2019-03-05 16:51:59  jaina mahasabha, indore, ham dho mahare theen

ఇండోర్, మార్చ్ 5: తాజాగ ఇండోర్‌లో జరిగిన జైన మహసమితి సభలో జైన మహాసభ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు జైన దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చింది. 2001లో దేశం మొత్తం మీద జైనుల జనాభా 42 లక్షల మందిగా ఉంటే 2011కి అది 44 లక్షలకు మాత్రమే పెరిగింది. ఈ నేపథ్యంలో తమ జనాభా పెరుగుదల శాతం తగ్గుతోందనే కలవరం మత పెద్దల్లో మొదలైంది. దీంతో, ‘హమ్ దో.. మహారే తీన్’ నినాదంతో జైన్ దంపతులు ముందు సాగాలని పిలుపునిచ్చారు.