జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు దుర్మరణం

SMTV Desk 2019-03-02 12:06:57  Jammu Kashmir, Srinagar, Bus Accident

శ్రీనగర్, మార్చి 02: జమ్ముకాశ్మీర్లోని ఉద్డంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి మజల్తా వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు సురిన్‌సార్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.