చెన్నై, మార్చి 02: ఈ మధ్య కాలంలో హీరోలు, హీరోయిన్లు ఎక్కడికి వెళ్ళినా కలిసికట్టుగా దర్శనం ఇస్తున్నారు. మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు ఈవెంట్స్లో కలిసి కట్టుగా సందడి చేసారు. దీంతో అభిమానుల ఆననడం రెట్టింపయింది. ఇప్పుడు తాజాగా హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్ కలిసి ఒకేసారి కనిపించారు. ఈ దృశ్యం చూసిన అభిమానులు వారి నుండి చూపు తిప్పుకోలేకపోయారు. ఈ నలుగురు హీరోయిన్లు కెప్టెన్ మార్వెల్ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చెన్నైలో సందడి చేశారు.
ఈ సందర్భంగా వారికీ ఇష్టమైన కామిక్ పాత్రల గురించి చెబుతూ అభిమానులని ఆనందింప చేశారు. అంతేకాదు చిత్రంలోని పాత్రలలో మన తెలుగు హీరోలు ఎవరైతే బాగుంటారని కూడా చెప్పారు. మార్వెల్ సంస్థ నిర్మాణంలో కెరోల్ డేన్వర్స్ ఆధారంగా రూపొందిన అమెరికన్ సూపర్హీరో చిత్రం కెప్టెన్ మార్వెల్ . మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా హర్ ఇన్ ఎవ్రీ హీరో... పేరుతో చెన్నైలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులోనే ఈ నలుగురు భామలు కలిసారు. కాజల్, రకుల్, తమన్నాని కలవడం చాలా సంతోషంగా ఉందని సమంతా అన్నారు. కాజల్ కూడా తన కో ఆర్టిస్ట్ని ఇలా కలిసినందుకు ఆనందంగా ఉందని ట్వీట్ ద్వారా తెలిపింది.