న్యూఢిల్లీ, మార్చి 2: పాకిస్తాన్ చేతికి చిక్కిన భారత పైలట్ అభినందన్ కు పాక్ సైనికులే అతనికి సహాయంచేశారని తెలిపారు. అతను కిందపడ్డ సమయంలో చాలా మంది జనం గుమ్మికుడారని, ఆ హడావుడిలో తన పిస్టల్ కింద పడిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు కొత్తగా విడుదల చేసిన వీడియోలో అభినందన్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. తనను అల్లరి మూక వెంబడించిందని, తనని తను రక్షించుకోవడానికి పరుగులు తీశాడని తెలిపాడు.
తను పరుగెడుతున్న సమయంలో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు వచ్చి అల్లరి మూక నుండి రక్షించినట్టు పేర్కొన్నారు. తర్వాత వారు తనను వాళ్ల యూనిట్కు తీసుకెళ్ళి, ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్నారు. అక్కడే వైద్య పరీక్షలు కూడా చేయించారని చెప్పారు. నా విషయంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రొఫెషనల్గా వ్యవహరించిందని అభినందన్ వెల్లడించారు.