ఉత్తరప్రదేశ్, ఫిబ్రవరి 23: ఉత్తరప్రదేశ్ లోని భాదోహి సమీపంలో ఫ్యాక్టరీలో కాసేపటి క్రితం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు పదిమంది మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రెండస్తుల భవనంలో కార్పెట్లను తయారు చేసే కంపెనీ ఉండగా.. ఇందులోనే అక్రమంగా ఫైర్ క్రాకర్లను కూడా తయారు చేస్తున్నట్టు ప్రాధమికంగా గుర్తించామని భాదోహి ఐజీ పియూష్ శ్రీవాస్తవా తెలిపారు. అయితే పుల్వామా దాడుల తర్వాత మరిన్ని దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో… ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు తెలిపారు.