న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: మరి కొద్దీ రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది . ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2019 షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. కానీ వారు కేవలం 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే ప్రకటించారు. మార్చి 23 న ఈ టోర్నీ ప్రారంభం కానుంది . మొదటి మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లి కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి.
మిగతా మ్యాచ్ లు లోక్ సభ ఎన్నికల తరువాత జరగనున్నాయి… మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరిగే మ్యాచ్ల తాలూకు వివరాలను ఐపీఎల్ అధికారిక ట్విటర్లో తెలియపరిచారు . సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ తన తొలి మ్యాచ్ను మార్చి 24న కోల్కతా నైట్రైడర్స్తో ఆడనుంది. మార్చి 29న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది.