పీఎం–కిసాన్ కు అర్హులు

SMTV Desk 2019-02-08 08:52:29  Narendra Modi, Kisan Samman Nidi, Eligible Criteria

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 08: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అందరికి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ. 6000 సాయంగా అందించేందుకు అమలుచేయనున్నారు. అయితే దీనికి ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పని చేస్తున్న/రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుత/మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మునిసిపల్‌ మేయర్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షులు అర్హులు కారు అని తెలిపింది.

గత ఏడాది ఆదాయ పన్ను చెల్లించిన వారిని కూడా అర్హులు కారు అని పేర్కొంది. ఐదెకరాల్లోపు భూమి ఉన్నా కూడా కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వృత్తి నిపుణులు (వైద్యులు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టెర్డ్‌ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు)ఉన్నా అర్హులు కారని తెలిపింది. కేంద్రం ఈ పథకం కొరకు రూ.75వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపిన విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ లోపు మొదటి విడతగా బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. రెండో విడతకు మాత్రం ఆధార్‌ కార్డును జత చేయాల్సి ఉంటుందని పేర్కొంది.