హైదరాబాద్, ఫిబ్రవరి 06: తెలుగు సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె హైదరాబాద్ శ్రీ నగర్ కాలనీ లో నివాసం ఉంటుంది. సాయి అపార్ట్మెంట్లోని తన నివాసంలో ఝాన్సీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించగా, అమెది ఆత్మహత్యే అని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఝాన్సీ ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే అని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా టివీలో ప్రసారమయ్యే పవిత్ర బంధం అనే సీరియల్ లో ఝాన్సీ నటించారు. ఆమె మృతికి పలువురు టివి ప్రముఖులు సంతాపం తెలిపారు.