జింద్‌ ఉప ఎన్నికలో బీజేపీ హవా

SMTV Desk 2019-01-31 12:30:54  Ranadeep Surjeevala, Midda, Krishna Midda, Um Singh, Digvijay Chouthala, BJP, Congress

చండీగడ్, జనవరి 31: జింద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి టాప్ లో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, ఐఎన్‌ఎల్డీ, జేజేపీల మధ్య గట్టి పోరు జరగగా, ఫలితాలూ ఉత్కంఠను రేపుతున్నాయి. మొదటి విడత లెక్కింపులో అత్యాదికం కనబరిచిన జేజేపీ, కాంగ్రెస్‌లు ఆ తర్వాత వెనుకంజ వేయగా ఐదో విడత ముగిసిన అనంతరం బీజేపీ 5737 ఓట్ల ఆధిక్యం సాధించింది.

రణ్‌దీప్‌ సుర్జీవాలా కాంగ్రెస్‌ తరపున దిగ్గజ జింద్‌ ఉప ఎన్నికలో బరిలో దిగగా, బీజేపీ తరపున మరణించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే మిద్ధా కుమారుడు కృష్ణ మిద్దా పోటీ చేశారు. ఐఎన్‌ఎల్లీ నుంచి ఉమ్‌ సింగ్‌, కొత్తగా ఏర్పాటైన జేజేపీ నుంచి దిగ్విజయ్‌ చౌతాలా రంగంలో నిలిచారు.