చెన్నై, జనవరి 28: మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ తమిళనాడు రాజాకీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాలపై అసంతృప్తి చెందిన ఆయన ఈ మద్యే పార్టీ స్థాపించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తమిళనాడును ఏ నాయకుడు బాగుచేయలేడని, తమిళనాట అత్యవసరంగా రాజకీయ ప్రక్షాళన జరగాలని అన్నారు. తమిళనాట గ్యోబాక్ నినాదాలు ఇవ్వడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షించుకోవాలన్నారు.
జగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కమల్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసారు. కాగా కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు-2 సినిమాలో నటిస్తున్నారు.