న్యూజిలాండ్ గడ్డ పై భారత్ జయభేరి

SMTV Desk 2019-01-28 15:05:41  new Zealand, India,

టీం ఇండియా అద్భుత విజయాన్ని నమోదుచేసింది న్యూ జిలాండ్ గడ్డ పై ... మూడో వన్డేలో 244 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోహ్లీసేన సునాయాసంగా టార్గెట్ ఛేదించింది. మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే... లక్ష్యాన్ని మట్టికరిపించింది . ఐదు వన్డేల సిరీస్‌లో మూడు వన్డేలను గెలిచి... సిరీస్‌ని తన వశం చేసుకుంది. టీంఇండియా విజయ పరంపరను న్యూజిలాండ్ బౌలర్లు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. కోహ్లీ సేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా టూర్‌లో విజయశంఖం పూరించిన టీంఇండియా... కివీస్ గడ్డపైనా తనకు తిరుగులేదని నిరూపించింది.