పద్మ అవార్డు వద్దన్న మాజీ సీఎం కూతురు..

SMTV Desk 2019-01-26 15:40:16  writer, Geetha mehata, padma sri aword, Declines, Naveen Patnaik, biju patnaik

న్యూఢిల్లీ, జనవరి 26: భారత ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వొరిస్సా మాజీ సీఎం బిజూ పట్నాయక్‌ కుమార్తె, ప్రముఖ రచయిత్రి గీతా మెహతాకు పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. అయితే ఆమె ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దీని గురించి గీతా మెహతా మాట్లాడుతూ.. ‘ భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు నన్ను అర్హురాలిగా భావించినందుకు నేను చాలా గర్వ పడుతున్నాను. కానీ ఈ అవార్డును నేను తిరస్కరిస్తున్నాను. దీనికి గాను నన్ను క్షమిం​చాలి అని అన్నారు.





ఆమె ఈ అవార్డు వద్దనటానికి గల కారణాన్ని కూడా తెలిపారు. ‘త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేను ఈ అవార్డును స్వీకరిస్తే ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉంది. నేను ఈ అవార్డు స్వీకరించడం నాకు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అందుకే ఈ అవార్డును తిరస్కరిస్తున్నాను. ఇందుకు నన్ను క్షమించాలి అన్నారు. గీతా ప్రస్తుత వొరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి. ఆమె ఆల్ప్రెడ్ ఎ.నోఫ్ పబ్లిషింగ్ హౌస్ అధిపతి సోనీ మెహతాను వివాహమాడారు. ఆమె రాసిన పుస్తకాలు 21 భాషలలో అనువాదమయ్యాయి.