బాలయ్యకు నాగబాబు వార్నింగ్..

SMTV Desk 2019-01-11 12:41:27  Balakrishna, Nagababu, 6th Comment, Nagababu worns balakrishna

హైదరాబాద్, జనవరి 11: యువరత్న బాలకృష్ణ అంతకముందు ఓసారి మీడియాతో మాట్లాడుతూ..‘చిరంజీవి ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరిపోడు అని అన్నారని నాగబాబు అన్నారు. ఈ క్లిప్పింగ్ ఆంధ్రజ్యోతి పేపర్ లో కూడా వచ్చిందన్నారు. ఈ మాటలతో తమకు చాలా బాధ కలిగిందన్నారు. దానిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ..‘బాలకృష్ణ చిన్నపిల్లాడు. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అని వదిలేశారని గుర్తుచేశారు. కాగా, ఇప్పుడు బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ఆరో వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో రిక్షా తొక్కే వ్యక్తి తన కొడుక్కి గొప్ప కావొచ్చు, బాలయ్య తన తండ్రి గొప్పతనాన్ని కీర్తించుకోవడం ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. అయితే పక్కనవారిని అవమానించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.

ఇక ఆ వీడియోలో బాలయ్యని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘చిరంజీవి కాలిగోటికి కూడా బాలకృష్ణ సరిపోడు అని మేము అంటే... మీకు ఎలా ఉంటుంది? మీ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది? మీ ఇంట్లో వాళ్ళకు ఎలా ఉంటుంది? మీ పార్టీ వాళ్లకు ఎలా ఉంటుంది? అంత లోకువ అయిపోయాడా చిరంజీవి అనే వ్యక్తి మీకు.. ఎంత అహంకారం మీకు? మేము అనలేము అనుకున్నారా, నెక్స్ట్ మినిట్ లో అనగలం. కానీ మాకు సంస్కారం ఉంది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడట్లేదు అని అన్నారు. ఎలా మాట్లాడారు మీరు.. మాకు కోపాలు రావా? సర్.. మర్యాదగా చెబుతున్నా మీకు.. దయచేసి మాట్లాడేటప్పుడు నోరును అదుపులో పెట్టుకోండి. మీరు వంద విమర్శలు చేయండి. కానీ లూజ్ టంగ్ తో మాట్లాడకండి. కేవలం సంస్కారంతోనే మేం ఆగుతున్నాం. ఇక్కడ ఎవరూ ఎవరికీ భయపడరు. మా అన్నయ్య, తమ్ముడిని ఎవరైనా అంటే మాత్రం 100 శాతం రియాక్ట్ అవుతానన్నారు. ఇప్పటికైనా ఈ లూజ్ టంగ్ ను ఆపేస్తారని ఆశిస్తున్నాం అని తెలిపారు.

పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోవాలనీ, రాజకీయంగా అతని విధానాలపై, ఆటను మాట్లాడిన మాటలపై విమర్శలు చేయొచ్చని నాగబాబు స్పష్టం చేశారు. అలాంటి వాటిపై తాను ఎప్పుడు రియాక్ట్ కాబోనన్నారు. చిరంజీవి అంటే కేవలం తమకు అన్నయ్య మాత్రమే కాదనీ, తండ్రితో సమానమని వ్యాఖ్యానించారు. తమ అన్నదమ్ముల మధ్య చాలా విషయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయనీ, కానీ తాము ముగ్గురం కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ఇకపై తాను బాలయ్య జోలికి రాబోననీ, కానీ తమ కుటుంబాన్ని మరోసారి విమర్శిస్తే తాను మళ్లీ రావాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇండస్ట్రీ మొత్తం బాలయ్యకు గులాములు కాదన్నారు. ‘థ్యాంక్యూ బాలయ్య గారూ.. ఇకపై మీరు దీన్ని కొనసాగించాలనుకుంటే మీ ఇష్టం. మెగా ఫ్యాన్స్ కు వొకటే విన్నపం.. మనం చెప్పాల్సింది చెప్పాం. ఇకపై దీన్ని ఇష్యూ చేయకండి. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కావొచ్చు. బాలయ్య ఫాన్స్ కావొచ్చు. మహేశ్ బాబు ఫ్యాన్స్ కావొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావొచ్చు. మనమంతా మనుషులమే. ఆ తర్వాతే అభిమానులం అని నాగబాబు స్పష్టం చేశారు.