న్యూ ఢిల్లీ, జనవరి 2: ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ నగరం పేరును ప్రయాగ్రాజ్గా మార్చేందుకు కేంద్రం అంగీకరించింది. కుంభమేళా ప్రారంభం కావడానికి 15 రోజుల ముందే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు నెలల క్రితమే యూపీ ప్రభుత్వం అలహాబాద్ పేరును చరిత్రాత్మక ప్రయాగ్రాజ్గా మార్చింది. తమ ప్రతిపాదనను ఆమోదించాలని కోరుతూ పది రోజుల క్రితం కేంద్ర హోంశాఖను యూపీ సర్కార్ కోరింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది ఈ నెల 15న మకర సంక్రాంతి రోజున ప్రయాగ్రాజ్లో మొదలయ్యే కుంభమేళా మార్చి నాలుగో తేదీన మహా శివరాత్రితో ముగుస్తుంది.