తగ్గుముఖం పట్టిన పెట్రోల్ ధరలు

SMTV Desk 2018-12-29 17:29:14  Petrol, Price, New delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: పెట్రోల్ ధరలు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర ఈ ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం లీటరు పెట్రోలు ధర రూ.69.55 ఉండగా, శనివారం 29 పైసలు తగ్గి రూ.69.26కి చేరుకుంది. జనవరి తర్వాత తొలిసారి ఢిల్లీలో డిసెంబరు 24న లీటరు పెట్రోలు ధర రూ.70కి చేరుకోగా, ఇప్పుడు మరింత కనిష్టానికి పడిపోయింది.