హిమాచల్ ప్రదేశ్ నా ఇంటిలాంటిది : ప్రధాని

SMTV Desk 2018-12-27 16:41:44  Narendra Modi, PM, Himachal Pradesh, BJP rally

సిమ్లా, డిసెంబర్ 27: హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం తన ఇంటిలాంటిదని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ప్రయాణిస్తూ ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. తనతో పాటు పని చేసిన వ్యక్తులు ఇప్పుడు ముఖ్య నేతలుగా ఎదగడం చాల సంతోషకరంగా ఉందని చెప్పారు. ధైర్యసాహసాలు కలిగిన సైనికుల గడ్డ హిమాచల్ ప్రదేశ్ అని... సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం వీరంతా ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటారన్నారు.

ఈ సందర్భంగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి ఠాకూర్ కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ తనకు ఇంటిలాంటిదని... రాష్ట్రంలో పార్టీని నిర్మించే క్రమంలో గతంలో తాను ఇక్కడ ఎన్నో ఏళ్లు పని చేశానని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం తన ఇంటిలాంటిదని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ప్రయాణిస్తూ ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.