హైదరాబాద్ , డిసెంబర్ 26 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యాష్ హీరో గా ప్రపంచ వ్యాప్తంగా 7భాషలలో విడుదలైన కేజ్రీ చిత్రం కె జి ఎఫ్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తెలుగులో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది .
కాగా ఈ చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాలలో విజయయాత్ర ప్రారంభించారు , ఎక్కడికి వెళ్లిన అద్భుతమయిన స్పందన వస్తుంది . అయితే తాజా గా ఆ యాత్రలో తనకు ఎదురయినా అనుభవాన్ని హీరో యాష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు ,"ఇప్పుడు కెజిఎఫ్ చాలా మందికి దగ్గరయింది ,తిరుపతిలోని థియేటర్లను సందర్శించేటప్పుడు అద్భుతమైన అనుభవం! అక్కడ ప్రజలందరి ప్రేమ,మద్దతు భరించలేనంత గొప్పగా ఉంది ".
మేము ఇక్కడివాళ్ళము కాదు కానీ మీరు చుపించే అభిమానం చూస్తుంటే నాకు చాల సంతోషంగా ఉంది అని తెలుగు భాష లో ప్రేక్షకులతో ముచ్చటించాడు.
KGF has brought me closer to a lot of people now. Had a wonderful experience while visiting the theatres in Tirupathi for #KGF! I am overwhelmed by all the love and support from the people there. Truly honoured by the response 😊 pic.twitter.com/CiWdTcrBOz
— Yash (@TheNameIsYash) December 26, 2018