పబ్లిక్ ప్రదేశాల్లో నమాజ్ చేయవద్దంటున్న పోలీసులు..!

SMTV Desk 2018-12-25 18:03:01  Noida, police, Namaz

నోయిడా, డిసెంబర్ 25: దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని నోయిడా పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ ప్రదేశాల్లో నమాజ్ చేయవద్దని ఆదేశించారు. ఈ మేరకు మల్టీ నేషనల్ కంపెనీలకు నోటీసులను అందించారు. ఆ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు పార్కుల్లో నమాజ్ చేయరాదని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా, ఈ ఆదేశాలు వివాదానికి దారి తీశాయి, కోర్టుకు వెళ్లేందుకు కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అయితే, పోలీసులు తమ ఆదేశాలకు మతం రంగు పులమవద్దని స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రాంతాల్లో నమాజ్ చేయడం వల్ల సామరస్యం దెబ్బతింటుందని కొన్ని హిందూ సంస్థలు నోయిడా ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. దీంతో, నోయిడా పరిధిలో ఉన్న 58 పోలీస్ స్టేషన్ల నుంచి కంపెనీలకు ఆదేశాలు వెళ్లాయి.