లోయలో పడిన జవాన్ల బస్సు...ఒకరి మృతి!

SMTV Desk 2018-12-24 15:26:07   Jammu and Kashmir Bus Accident, ITBP

జమ్ముకాశ్మీర్‌, డిసెంబరు 24: జమ్ముకాశ్మీర్‌ రాంబన్‌ జిల్లా ఖునీనల్లా ప్రాంతంలో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో వొక జవాను మృతి చెందగా, మరో 34 మంది జవాన్లు గాయపడ్డారు. ఇటీవల జరిగిన స్థానిక అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న జవాన్లు సోమవారం బుద్గామ్‌ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో బస్సు అదుపుతప్పి లోయవైపు పడిపోయింది.

అయితే, అదృష్టవశాత్తు బస్సు లోయలోకి పడిపోకుండా చెట్లు అడ్డుకోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయానికి బస్సులో మొత్తం 35 మంది జవాన్లు ఉండగా వీరిలో వొకరు చనిపోయారు. మిగిలిన వారిని భద్రతా సిబ్బంది, స్థానికులు రక్షించి లోయలో నుంచి బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.