రాజ్‌నాథ్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న రామభక్తులు..!

SMTV Desk 2018-12-24 15:09:40  Rajnadh singh, lucknow, Ayodhya, Ram temple

లక్నో, డిసెంబర్ 24: కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కు యూపీలో చేదు అనుభవం చోటుచేసుకుంది. రాజ్‌నాథ్‌ సింగ్‌ సొంత నియోజకవర్గమైన లక్నోలో పర్యటిస్తున్న సమయంలో, ఓ కార్యక్రమంలో రామ భక్తులు నానాఅల్లరి చేశారు. "అయోధ్యలో రామమందిరం నిర్మించిన వారికే తాము ఓటువేస్తాం. వారినే ఎన్నుకుంటాం" అంటూ నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘటనపై రాజ్ నాథ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. దేనికైనా సమయం రావాలని గట్టిగా సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు, కానీ లాభంలేకపోయింది. అక్కడే ఉన్న పోలీసులు, బీజేపీ నేతలు కల్పించుకుని రామభక్తులకు సర్దిచెప్పడంతో, వారు కాస్తంత వెనక్కు తగ్గారు. దీంతో సభ సజావుగా సాగింది.