చెన్నై, డిసెంబర్ 19: ప్రముఖ పార్టీ ఏఐఏడీఎంకే సీనియర్ నేత పన్నీర్ సెల్వం సోదరుడు ఓ. రాజాను పార్టీ నుంచి బహిష్కరించారు. రాజా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించారు.
ముఖ్యమంత్రి పళని స్వామి, పన్నీర్ సెల్వం సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో రాజాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. పార్టీకి అప్రతిష్ఠ తీసుకొచ్చే విధంగా రాజా వ్యవహరిస్తున్నారని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఆయనతో సంబంధాలు పెట్టుకోరాదని పార్టీ కార్యకర్తలకు తెలిపారు