న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెరాస ఎంపీ జితేందర్రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న ఈవిషయంపై కేంద్రమంత్రులను టిఆర్ఎస్ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతు రాష్ట్ర విజభన జరిగి నాలుగున్నరేళ్లు అయిన ఇంకా విభజన హామిలు నెరవేర్చలేదని విమర్శించారు. మోడిది మాటలు ప్రభుత్వమేనని, చేతల ప్రభుత్వం కాదని ఆయన ఎద్దేవా చేశారు.