చిదంబరం కేసు పొడగించిన ఢిల్లీ కోర్టు

SMTV Desk 2018-12-18 13:30:08  P. Chidanbaram, Delhi court, Airselmyacsis case

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18: మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరానికి ఢిల్లీ కోర్టులో ఎయిర్‌సెల్మ్యాక్సిస్ కేసులో ఆయనకు అరెస్టు నుంచి కల్పించిన రక్షణను జనవరి 11 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో కొత్త సమాచారం సేకరించామనీ.. వాటిని సరిచూసేందుకు మరికొంత సమయం అవసరమవుతుందని సీబీఐ, ఈడీ అధికారులు కోర్టుకు నివేదించారు. దీంతో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు మంజూరైన మధ్యంతర రక్షణను పొడిగించాలని ధర్మాసనం నిర్ణయించింది.