మధ్యప్రదేశ్, డిసెంబర్ 17: రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ రోజు భోపాల్ లోని లాల్ పరేడ్ గ్రౌండ్స్లో తన ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. భోపాల్ లోని లాల్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పార్టీ నాయకులు, భారీ సంఖ్యలో హజరైన అభిమానులు, ప్రజల నడుమ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ ఫైల్ పై తొలి సంతకం చేశారు.
సుమారు రూ.2లక్షల వరకు రైతుల రుణమాఫీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను అమలు చేసే కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలుపెట్టారు. అంటూ ఏఐసీసీ వర్గాలు ట్వీట్ చేశాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.