మధ్యప్రదేశ్, డిసెంబర్ 17: రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ రోజు భోపాల్ లోని లాల్ పరేడ్ గ్రౌండ్స్లో తన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ నాయకులతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
చింద్వారా నుంచి 9 సార్లు లోక్సభకు ఎన్నికైన కమల్నాథ్ సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఇవాళ్టి కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హజరయ్యారు.