రాజస్తాన్ కొత్త ముఖ్యమంత్రి

SMTV Desk 2018-12-16 13:42:49  Rajsthan CM,

రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ వీడింది. సీనియర్ కాంగ్రెస్‌ నేత, రాహుల్ గాంధీకి అత్యంత ఆత్మీయుడైన అశోక్ గెహ్లాత్ ను ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన యువనేత సచిన్ పైలట్ ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. వారిరువురూ కలిసి త్వరలోనే రాజస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల పరిశీలకుడు కేసీ.వేణుగోపాల్‌ తెలిపారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల తరువాత రాహుల్ గాంధీ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పేరు ఖరారు చేయవలసి ఉంది. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి పదవికి ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు భూపేష్ బాగేల్ (పటాన్ ఎమ్మెల్యే) , సీనియర్ నేతలు త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్ (డియో ఎమ్మెల్యే), అమర్ద్వార్ సాహు (దుర్గ్ ఎమ్మెల్యే) పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో వొకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉంది.