రాహుల్ ని కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

SMTV Desk 2018-11-21 15:22:28  Konda vishweshar reddy, rahul gandhi

న్యూ ఢిల్లీ, నవంబర్ 21: నిన్న సాయంత్రం తెరాస పార్టీ నుండి రాజీనామా చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బుదవారం ఉదయం డిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ నన్ను సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇవ్వాళ్ళే లోక్ సభ స్పీకర్ ను కలిసి నా ఎంపీ పదవికి రాజీనామా లేఖను సమర్పిస్తాను. తెరాసలో ఉద్యమకారులకు, పార్టీ కోసం నిబద్దతతో పనిచేసే నావంటివారికి చోటు లేదు. అందుకే తెరాసకు రాజీనామా చేశాను. నేను ఎల్లుండి (శుక్రవారం) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను,” అని చెప్పారు.

శుక్రవారం మేడ్చల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఆ సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ హాజరవుతారు. ఆ సభలో వారిరువురి సమక్షంలోనే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొన్నారు. ఆయనతో పాటు ఆ రోజు వోక తెరాస ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.