చెన్నై, నవంబర్ 15: లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘భారతీయుడు . తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి కమల్, శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ‘భారతీయుడు-2 పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో కమల్ తో పాటుగా ఇప్పటికే మళయాల యువ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఇప్పుడు మరో కోలీవుడ్ హీరో శింభు కూడా ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడట.
అవినీతి వ్యతిరేకంగా వ్యక్తి చేసే పోరాటమే ఇండియన్ కథ.. అలాంటి కథతోనే మరోసారి ఇండియన్ 2 తో వస్తున్నారు శంకర్. కమల్ తో పాటుగా దుల్కర్ సల్మాన్, శిభు ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక తెలుగు నుండి కూడా వొక స్టార్ హీరోని ఈ సినిమాలో నటింపచేయాలని చూస్తున్నారట. అదే జరిగితే ఇది తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ మల్టీస్టారర్ అవనుంది. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఇండియన్ 2 మూవీ త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది.