గుంటూర్, అక్టోబర్24: ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది వొకే మ్యాచ్ లో డకౌట్ అయ్యారు.బీసీసీఐ అద్వర్యం లో అండర్-19 మహిళల టీ20 గుంటూర్ లో నిర్వహించగా ఆంధ్రా-సిక్కిం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది.
మొదటగా బ్యాటింగ్ చేసిన ఆంధ్రా జట్టు నిర్ణీత 20 వోవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 208 పరుగుల భారీ లక్ష ఛేదనలో సిక్కిం జట్టు కేవలం 8 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సిక్కిం జట్టులో ప్రీతిక (5), అర్చన (1)లు మాత్రమే పరుగుల ఖాతా తెరిచారు. మరో రెండు పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. ఆంధ్ర పేస్ బౌలర్ సాయిలక్ష్మి 6 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసింది. సాయిలక్ష్మి వొకే వోవర్లో 4 వికెట్లు తీసుకుంది. సింధుజ 1 పరుగు ఇచ్చి 3 వికెట్లు తీసింది. అయితే గాయం కారణంగా వొక క్రీడాకారిణి బ్యాటింగ్కు రాలేదు. 199 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ఆంధ్రా జట్టు తర్వాతి రౌండుకు అర్హత సాధించింది.