33 మంది అక్కడికక్కడే మృతి చెందారు

SMTV Desk 2018-07-28 14:32:33  maharashtra,bus accident,

మహారాష్ట్ర, జూలై 28: రాష్ట్రంలోని సతారా జిల్లా అంబేనలి ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొలందపూర్ దగ్గర ప్రైవేటు బస్సు 500 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ప్రమాదంలో 33 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 7 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితులు కొంకణీ వ్యవసాయ యూనివర్సీటీకి చెందిన సిబ్బందిగా గుర్తించారు. ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికితీశారు. మహాబలేశ్వరం విహారయాత్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.