ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల మోత..

SMTV Desk 2018-07-15 13:07:40  Chattisgarh encounter, Encounter With Maoists, bsf jawans, Chhattisgarh

కాంకెర్‌, జూలై 15 : ఛత్తీస్‌గఢ్‌‌‌లో నక్సల్స్‌ మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బీఎస్‌ఎఫ్‌ జవాన్లపై మరోసారి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి చెందగా.. మరొక జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 3.45గంటలకు బీఎస్‌ఎఫ్‌ ప్లాటూన్ లక్ష్యంగా నక్సల్స్‌ దాడికి దిగారు. ఈ ఘటనలో లోకేందర్‌ సింగ్‌(రాజస్థాన్‌), ముక్దియార్‌ సింగ్‌(పంజాబ్‌) మృతి చెందగా మరొక జవాన్ సందీప్‌ దే తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. ఘటనానంతరం జవాన్ల మృతదేహాలను పాఖంజోర్‌లోని 114వ బెటాలియన్‌లోని బీఎస్ఎఫ్ క్వార్టర్స్‌కు తరలించారు. నక్సల్స్‌ కోసం ఆ ప్రాంతన్ని భద్రతాసిబ్బంది జల్లెడ పడుతున్నారు.