బ్రెడా(నెదర్లాండ్స్), జూలై 2 : హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. ఇండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో4-2తో ఆస్ట్రేలియా గెలుపొందింది. దీంతో వరుసగా రెండోసారి చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు రన్నరప్తో సరిపెట్టుకుంది. తొలి నుంచి భారత్పై పూర్తి ఆధిక్యంతో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతూ వచ్చింది. ఈ క్రమంలో 24నిమిషంలో ఆసీస్ ఆటగాడు బ్లేక్ మొదట గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలో జోరు పెంచిన భారత్కు 43నిమిషంలో తొలి గోల్ లభించింది. భారత ఆటగాడు వివేక్ సాగర్ ఆసీస్ గోల్కీపర్ను బోల్తా కొట్టించి స్కోరును 1-1కి సమం చేశాడు. తర్వాతి నుంచి మరో గోల్ కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడినా ఫలితం లేకపోవడంతో మ్యాచ్ షూటౌట్కు దారితీసింది. దీంతో షూటౌట్లో చెలరేగిన ఆసీస్ 3-1తో ఆధిక్యాన్ని సంపాదించి ట్రోఫీని ముద్దాడింది.