చత్తీస్గఢ్, జూలై 1 : చత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి కాల్పుల మోత మోగింది. రాష్ట్రంలోని సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. భద్రతా బలగాలు - మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులో ఒక మావోయిస్టు మృతి చెందగా మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుడు దళ కమాండర్ జగ్గూని పోలి ఉన్నట్లు భావిస్తున్నారు. సంఘటనా స్థలం నుండి పోలీసులు ఒక మావోయిస్టు మృతదేహం, వారికి సంబంధించిన సామాగ్రి, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.